Friday, May 10, 2024

భారీ అగ్నిప్ర‌మాదంలో ఆరుగురు మృతి : ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన‌ ప్ర‌ధాని

గుజరాత్‌లో భరూచ్‌లోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆరుగురు పనివాళ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 2 లక్షల రూపాయల సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ట్వీట్‌ చేసింది ప్రధాని కార్యాలయం. అలాగే ఎవరైనా గాయపడితే రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement