Tuesday, April 30, 2024

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ పత్రాచాల్‌ భూ కుంభకోణంలో అరెస్టయిన విషయం విధితమే. అయితే ఆయన ఇప్పటికే కస్టడీలో ఉండగా.. ఆ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈనెల 8వ తేదీ వరకు పొడిగించింది. కస్టడీ ఇవాళ్టితో ముగియనుండగా.. ఈడీ ఆయనను పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచగా.. కస్టడీని పొగించింది. ఈడీ కస్టడీ పొడిగింపుపై సంజయ్‌ రౌత్‌ సోదరుడు సునీల్‌ రౌత్‌ స్పందిస్తూ.. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. సంజయ్‌ రౌత్‌ బాలా సాహేబ్‌ ఠాక్రే నిజమైన శివసైనికుడని, ఆయన ఎప్పుడూ అవినీతికి పాల్పడరని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement