Friday, May 3, 2024

అంబులెన్స్ ని ఢీ కొన్న ట్ర‌క్కు – ఏడుగురు మృతి

ఓ ట్ర‌క్క్ ని అంబులెన్స్ ఢీ కొంది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాయ్ బ‌రేలీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి వెళ్లి హెల్త్ చెక‌ప్ చేసుకుని వ‌స్తున్న ఆరుగురు ఆ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ప్ర‌మాదం చాలా భీక‌రంగా జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. రెండు వాహ‌నాలు ఎదురెదురుగా రావ‌డం వ‌ల్ల ఆ రెండు వాహ‌నాలు నుజ్జునుజ్జ‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబ‌స‌భ్యుల‌కు సీఎం యోగి సంతాపం తెలిపారు. ఆ కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వ అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. గాయ‌ప‌డ్డ‌వారికి చికిత్స‌ను అందించాల‌ని సూచించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement