Saturday, April 27, 2024

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల పున:ప్రారంభం.. జీవో విడుదల

తెలంగాణలో మళ్లీ స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. ఈ మేరకు పాఠశాలల పునః ప్రారంభం విషయంలో తెలంగాణ విద్యాశాఖ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను తెరిచి, భౌతిక తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. కరోనా కేసుల నేపథ్యంలో నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఈనెల 30లోగా శానిటైజేషన్ చేయాలని పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులకు సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలిచ్చారు. మరో వైపు రాష్ట్రంలో విద్యా సంస్థల పునః ప్రారంభం, సన్నద్ధంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జడ్పీ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement