Thursday, April 25, 2024

సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స.. ఆపరేషన్ సక్సెస్

నటుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. సాయితేజ్ కాలర్ బోన్ కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, క్రమంగా మెరుగుపడుతోందని వెల్లడించారు. నిపుణులైన వైద్యబృందం పర్యవేక్షణలో సాయితేజ్ కు చికిత్స కొనసాగుతుందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. ఈ సర్జరీలో అనేక విభాగాలకు చెందిన వైద్యులతో కూడిన బృందం పాల్గొందని తెలిపారు.

ఈ నెల 10న ఐకియా సమీంలో  స్పోర్ట్స్ బైకుపై వెళుతున్న సాయితేజ్ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. తొలుత స్థానికులు మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆపై జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో సాయితేజ్ కు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఇది కూడా చదవండిః గణేశ్ విగ్రహాల నిమజ్జనం తీర్పుపై రివ్యూ పిటిషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement