Saturday, July 27, 2024

వరంగల్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున ఒంగోలు నుంచి వరంగల్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సింది. మృతులు కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకట సాయిగా గుర్తించారు. వర్ధన్నపేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement