Monday, April 29, 2024

అగ్నివీరుల రిటైర్మెంట్ ను 65 ఏళ్లకు పెంచాలి : మ‌మ‌తా బెన‌ర్జీ

అగ్నిపథ్ పథకం ద్వారా నియమితులయ్యే అగ్నివీరుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సైనిక నియామకాల కోసం తీసుకున్న అగ్నిపథ్ విధానంపై తీవ్ర ఆగ్రహజ్వాలలు రేగినప్పటికీ కేంద్రం వెనుకంజ వేయలేదు. తాజాగా త్రివిధ దళాల నియామకాల కోసం ఈ పద్ధతిలోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అగ్నిపథ్ విధివిధానాలపై మమతా బెనర్జీ స్పందించారు.

“బీజేపీలాగా కాకుండా ఎన్నో, మరెన్నో ఉద్యోగాలు కల్పించాలనేది నా ఆశయం. కానీ బీజేపీ వాళ్లు నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి నాలుగేళ్ల పాటు విధులు నిర్వర్తించేందుకు నియామకాలు చేపడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ సైనికులు ఏంచేయాలి ? వాళ్ల తలరాత ఏంటి ? దీనిపై అనిశ్చితి నెలకొని ఉంది” అని మమతా బెనర్జీ వివరించారు. నాలుగేళ్ల పదవీకాలం ముగిసేసరికి వారికి భవిష్యత్ అనిశ్చితికరంగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సైనిక నియామక విధానాన్ని తెరపైకి తెచ్చిందని మమతా బెనర్జీ ఆరోపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement