Thursday, April 25, 2024

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటిపై కేసు కొట్టివేత

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌‌ పై ఎన్నికల కమిషన్‌ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ కొట్టివేసింది. 2014 ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ వెల్లడికి ముందే అంచనాలను ప్రకటించడాన్ని అప్పటి ఎన్నికల సంఘం కమిషనర్‌ లగడపాటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులను కోర్టు పలు దఫాలుగా విచారించడంతో పాటు ఆడియో,వీడియో రికార్డింగ్‌లను న్యాయస్థానం పరిశీలించింది. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement