Monday, April 29, 2024

TSPSC పేపర్ లీక్ కేసులో రేణుకకు బెయిల్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితురాలుగా ఉన్న రేణుకకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రతి సోమ, బుధ, శుక్రవారం సిట్ ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో రమేశ్, రాజేశ్ లకు కూడా ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

అయితే గతంలో కూడా రేణుక బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ సారి బెయిల్ పిటిషన్‌పై రేణుక తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమె అనారోగ్యం, దర్యాప్తు అంతిమ దశలో ఉందన్న కారణాలపై బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు రేణుకకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement