Tuesday, April 30, 2024

Karimnagar: ఏడాదిగా బాలికపై అత్యాచారం.. ఆరుగురు విద్యార్థుల అరెస్ట్

కరీంనగర్​లో దారుణం జరిగింది. నగరంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఉండే ఇంటర్‌ చదివే బాలుడితో ఆమె ప్రేమలో పడింది. ఏడాది క్రితం వారిద్దరు సన్నిహితంగా ఉండగా.. బాలుడి స్నేహితులు వారి వీడియోలు చిత్రీకరించారు. అనంతరం బాలికకు అవి చూపించి.. తన తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి ఇద్దరు స్నేహితులు..ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

అలాగే మరో ముగ్గురు స్నేహితులు ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా అరెస్టైన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు కాగా, మరొకరు పాలిటెక్నిక్ విద్యార్థి.

Advertisement

తాజా వార్తలు

Advertisement