Saturday, May 18, 2024

ఢిల్లీ చేరుకున్న ఘంటసాల విద్యార్థి – యుద్ధ‌ పరిస్థితి నుంచి బయటపడ్డ రాకేష్ కుమార్

ఘంటసాల : ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న ఘంటసాలకు చెందిన దేవరకొండ రాకేష్ కుమార్ ఢిల్లీ చేరుకున్నాడు. కీవ్ నుంచి అష్టకష్టాలు పడి పోలెండ్ కు చేరుకోగా, బుధవారం రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్ లో ఢిల్లీకి బయలుదేరినట్లు రాకేష్ కుమార్ తెలిపాడు. ఉక్రెయిన్ లో భీతావహ పరిస్థితుల నుంచి బయటపడి క్షేమంగా ఢిల్లీ చేరినట్లు విద్యార్థి వివరించారు. పోలాండ్ నుంచి మొత్తం 600 మంది భారతదేశానికి రాగా, కళాశాలకు సంబంధించి మొత్తం 30 మంది విద్యార్థులు ఇండిగో ఫ్లైట్ లో తనతోపాటు వచ్చినట్లు చెప్పాడు. ఇండియ‌న్ ఎంబ‌సీ సాదర స్వాగతం పలికి వసతులు కల్పించినట్లు తెలిపారు. తమ కుమారుడు ఢిల్లీ చేరుకోవటంతో తల్లిదండ్రులు పాపారావు – దుర్గలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement