Sunday, May 5, 2024

ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘కృతిశెట్టి’

ఈ ఏడాది మ‌రో మూడు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది హీరోయిన్ కృతిశెట్టి. ఆ జాబితాలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ .. ‘ది వారియర్’ .. ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సూర్య – బాల కాంబినేషన్లో రూపొందే సినిమాలో రెండవ కథానాయికగా ఎంపికైందట‌. అంతేకాదు .. ఏకంగా ప్రభాస్ జోడీగా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ‘రాజా డీలక్స్’ సినిమాను రూపొందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు నాయికలు కనిపించనున్నారు. కృతి శెట్టిని ఒక కథానాయికగా .. మాళవిక మోహనన్ ను మరో కథానాయికగా తీసుకున్నారట. మరో కథానాయికగా ఎవరిని ఎంచుకుంటారనేది చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement