Thursday, May 9, 2024

రాధేశ్యామ్ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ కి గెస్ట్ లు ఎవ‌రో తెలుసా

పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 23న జ‌ర‌గ‌నుంది. కాగా ఈ ఈవెంట్ కి అభిమానులే గెస్టులుగా హాజ‌రుకానున్నార‌ట‌. ఐదు భాషలకు చెందిన ట్రైలర్స్ ను ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈవెంట్ కు వచ్చే అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటించాలని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, పూజా హెగ్డే జంటగా న‌టించారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రానికి కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement