Thursday, May 2, 2024

Movie: పక్కా కమర్షియల్​.. గ్రాండ్​గా జరిగిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​!

గోపీచంద్ కొత్త సినిమా ‘పక్కా కమర్షియల్స ఇవ్వాల (ఆదివారం) రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటోంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీఖన్నా న‌టించింది.. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘పక్కా కమర్షియల్స్‌’ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, ఈ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో మెగాస్టార్​ చిరంజీవి మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ఒక్కొక్కరి గురించి వివరంగా మాట్లాడుతూ వారి టాలెంట్​ని, వారిలోని ప్రత్యేకతను పొగిడారు. ఇట్లా చిరంజీవి తమను పొగడ్తలతో ముంచెత్తడంతో అక్కడున్న వారు ఎంతో సంతోషంగా ఫీల్​ అయ్యారు. ఇక సభకు వచ్చిన వారు అయితే ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. కాగా తన సినిమాల్లో రావు గోపాలరావు ఎట్లాంటి రోల్​ పోషించారో గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రావు రమేశ్​ అట్లాంటి ఇంట్రెస్టింగ్​ క్యారెక్టర్స్​ లో ఇన్​వాల్వ్​ అవుతున్నారని, నటనలో మరో యాంగిల్​ చూస్తున్నామని చిరంజీవి కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement