Saturday, May 18, 2024

4న అన్ని మండ‌ల కేంద్రాల్లో నిర‌స‌న దీక్ష‌లు : కేటీఆర్

ఈనెల‌4వ తేదీన‌ తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టాల‌ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ… అలాగే ఏప్రిల్ 6న నాగపూర్, ముంబై, విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారులపై రాస్తారోకో, ఏప్రిల్ 7న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన దీక్షలు, ఏప్రిల్ 8న తెలంగాణలోని ప్రతి గ్రామంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ప్రతి ఇంటి మీద నల్లజెండా ఎగురవేసి కేంద్రానికి నిరసన తెలపాల‌న్నారు. అదేవిధంగా ఏప్రిల్ 11న ఢిల్లీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, పార్టీ నాయకులంతా కలిసి నిరసన దీక్షలు చేప‌ట్టాల‌న్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో తెలంగాణలోని ప్రతి రైతన్న పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement