Monday, April 29, 2024

ప్ర‌ముఖ స్టాక్ మార్కెట్ దిగ్గ‌జం -రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా క‌న్నుమూత‌

గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ క‌న్నుమూశారు ప్ర‌ముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా. ఆయ‌న వ‌య‌సు 62సంవ‌త్స‌రాలు.. దివారం ఉదయం 6.45 గంటలకు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఝున్‌ఝున్‌వాలా ఈ మధ్యే విమానయాన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన సారథ్యంలోని ఆకాశ ఎయిర్‌ ఈ నెల 7న తన తొలి సర్వీసును ప్రారంభించింది.ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా పేరుగాంచిన ఆయన 1985లో స్టాక్‌మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. రూ.5 వేలతో స్టాక్‌ ట్రేడింగ్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రస్తుత సంపాదన రూ.11 వేల కోట్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement