Sunday, April 28, 2024

కులం, మతం పేరుతో రాజకీయాలు – మండిప‌డిన ప్రియాంక గాంధీ

కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వాలు మూడు ద‌శాబ్దాలుగా అభివృద్ధి చేశామ‌ని గొప్ప‌గా చెప్పుకోవ‌డం త‌ప్ప చేసిందేమీ లేద‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలో ఉన్న ప‌రిస్థితుల‌ను దుయ్య‌బ‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై కూడా విమర్శలు గుప్పించారు. యుపి అభివృద్ధి చెందుతుంది, కానీ బిజెపి కేవలం మార్కెటింగ్ కోసం కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. “అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, గత 30 సంవత్సరాలుగా కులం, మతం పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని మండిప‌డ్డారు. కాగా పనియారలో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రియాంక ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీలు.. కుల, మతాలకు అతీతంగా ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాయని, దాని వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు. మీ పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోయినా, భావోద్వేగ విషయాలకు కళ్లు మూసుకుని ఓటేస్తారని ప్రియాంక ఓటర్లను ఉద్దేశించి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement