Wednesday, May 1, 2024

Breaking | అమరుల కుటుంబాలకు, యువతకు ప్రాధాన్యం.. ఉద్యోగ భృతి కల్పిస్తాం: మాయావతి

తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే యువతకు పెద్దపీట వేస్తామన్నారు ఆ పార్టీ అధినేత్రి మాయావతి. తెలంగాణ అమరుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, కౌలు రైతులకు అయిదు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేసి, ఎకరాకు 5వేలు ఇస్తామన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని సరూర్​నగర్​లో ఇవ్వాల (ఆదివారం) తెలంగాణ భరోసా బహిరంగ సభ జరుగుతోంది. అదేవిధంగా అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగులకు ప్రతినెలా 4వేల రూపాయలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా యూత్​ డిక్లరేషన్​ని రిలీజ్​ చేశారు మాయావతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement