Thursday, April 25, 2024

ప్ర‌ధాని త‌ల్లి హీరాబెన్ క‌న్నుమూత‌.. భావోద్వేగ ట్వీట్ చేసిన మోడీ

గ‌త రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మ‌దాబాద్ లోని యుఎన్ మెహ‌తా హాస్ప‌ట‌ల్ లో చేరారు ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ త‌ల్లి హీరాబెన్. కాగా ఆసుప‌త్రిలో ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లి మరణంపై నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ.. నిండునూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్ధం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలు అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది. తెలివితో పని చేయండి, స్వచ్చతతో జీవించండి అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను’ అంటూ మోడీ ట్విట్టర్‌లో ఎమోషనల్ అయ్యారు. హీరాబెన్ మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

చివరిసారిగా ఇటీవల హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా మోడీ తన తల్లి ఇంటికి వెళ్లారు. హీరాబెన్ మృతిపై అహ్మదాబాద్‌లోని UN మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. హీరాబెన్ మోదీ అనారోగ్యంతో తమ ఆస్పత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు మరణించినట్లు వెల్లడించింది. ఎప్పుడూ ప్రభుత్వ, రాజకీయ, విదేశీ పర్యటనలతో బిజీగా ఉండే మోడీ .. సమయం దొరికినప్పుడల్లా గుజరాత్‌లోని గాంధీ నగర్‌లోని తన తల్లి ఇంటికి వెళ్లి ఆమెను కలుస్తూ ఉంటారు. తల్లి ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. తన తల్లిని కలిసిన ప్రతి సమయంలోనే మోడీ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement