Saturday, April 27, 2024

ప్ర‌ధాని కాన్వాయ్ లో ఉన్న‌ది మోడీయేనా – హీరో సిద్ధార్థ్ ట్వీట్

ప్ర‌ధాని మోడీ కాన్వాయ్ ని పంజాబ్ లో అడ్డుకున్న ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఈ ఘ‌ట‌న‌పై ఒక్కొక్క‌రు ఒక్కొలా స్పందిస్తున్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ .. పంజాబ్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో అక్క‌డ నిలిచిపోయింది నిజంగా ప్ర‌ధాని మోడీ కాన్వాయేనా, అస‌లు అందులో మోడీ ఉన్నారా అనే సందేహాన్ని వ్య‌క్త ప‌రిచారు. ప్ర‌ధాని మోడీ కాన్వాయ్ లో ఉన్న‌ది న‌టులు కావొచ్చు. ఇలాంటి నటన బీజేపీ పార్టీ నేతలు ఎన్నో సార్లు చేశారు… ఇది కూడా పెద్ద నాటకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో సిద్ధార్థ్‌. దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అయితే.. సిద్ధార్థ్‌ చేసిన ఈ ట్వీట్‌ పై బీజేపీ నేతలు మండిపడుతుంటే.. కొంతమంది నెటిజన్లు.. సపోర్ట్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement