Friday, May 3, 2024

యుద్ధవిమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. ఈరోజు సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహ‌రించారు. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో రాష్ట్రపతి ప్రయాణించారు. యుద్ధ విమానంలో విహ‌రించిన రెండవ మ‌హిళా రాష్ట్ర‌ప‌తిగా ముర్ము రికార్డు క్రియేట్ చేశారు. తేజ్‌పూర్ విమానాశ్ర‌యం త‌వాంగ్ సెక్టార్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. సుఖోయ్ 30ఎంకేఐ .. ట్విన్ సీట‌ర్ ఫైట‌ర్ జెట్‌. దీన్ని ర‌ష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ డెవ‌ల‌ప్ చేసింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఫైట‌ర్ జెట్‌ను నిర్మించింది. 2009లో అప్పటి మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పూణే ఎయిర్‌ఫోర్స్ బేస్ నుండి ఫ్రంట్‌లైన్ సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. కాగా యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండవ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement