Sunday, April 28, 2024

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీకి చెందిన ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి చేసిన ఫిర్యాదుపై పునః సమీక్ష చేయాలని లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రానికి, కృష్ణా బోర్డుకు రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని కోరారు. గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్ట్ పేరు లేకపోవడం ఏపీ ప్రభుత్వ వైఫల్యం అని పేర్కొన్నారు. 2014 పునర్విభజన చట్టం ప్రకారం అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల్లో వెలిగొండ ఉందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలకు తోడు తెలంగాణ ఫిర్యాదుల వల్ల కరవు జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతందని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు జిల్లాపై కక్ష వద్దని లేఖలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండిః విద్యాసంస్థల పునఃప్రారంభంపై టీ-సర్కార్‌ కీలక ఆదేశాలు !

Advertisement

తాజా వార్తలు

Advertisement