Friday, May 17, 2024

2009లో ప్ర‌భాక‌ర‌న్ హ‌త‌మ‌య్యారు.. డీఎన్ ఏని ప‌రీక్షించాం..శ్రీలంక స‌ర్కార్

నెడు మార‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కొట్టిపారేసింది శ్రీలంక ప్ర‌భుత్వం..శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ… 2009 మే 19న ప్రభాకరన్ హతమైనట్టు ధ్రువీకరించారని తెలిపారు. ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించారని చెప్పారు. ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని, త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారంటూ తమిళ జాతీయవాద సంస్థ అధ్యక్షుడు నెడుమారన్ చేసిన ప్రకటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో ప్రభాకరన్ టచ్ లో ఉన్నారని… ఆయన కుటుంబం సూచన మేరకే తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని నెడుమారన్ చెప్పారు. ఈ వార్త నిన్న దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. శ్రీలంకలో సైతం ప్రకంపనలు పుట్టించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా స్పందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement