Thursday, April 25, 2024

జూన్‌ 30న పాలిసెట్‌.. ఏప్రిల్‌ రెండో వారం నుంచి దరఖాస్తులు

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ : పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 30న పాలిసెట్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి తెలిపింది. ఏప్రిల్‌ రెండవ వారం నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు జూన్‌ 4 వరకు అవకాశం కల్పించారు. రూ.100 అపరాధ రుసుముతో జూన్‌ 5 వరకు గడువిచ్చారు.

జూన్‌ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించిన అనంతరం 12 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తామని సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి పాలిటెక్నిక్‌, వ్యవసాయ, పశుసంవర్ధక, హార్టికల్చర్‌ యూనివర్శిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. బాసర త్రిపుల్‌ ఐటీలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ సీట్లను కూడా పాలిసెట్‌ మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇదే తొలి ప్రవేశ పరీక్షకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement