Saturday, May 4, 2024

హత్య కేసులో ముద్దాయి కోసం వేట.. పోలీసుల వాహనానికి ప్రమాదం

తిరుపతి నగరంలోని దాసరి మఠం వద్ద అతి దారుణంగా చంద్ర అనే వ్యక్తిని పద్మావతి పురం జిమ్ ట్రైనర్ చెంచయ్య దారుణంగా హత్య చేశాడు. దీంతో నిందితుడి పట్టుకునేందుకు వెళ్తున్న పోలీసుల వాహననం ప్రమాదానికి గురైయింది. హత్య కేసులో నిందితుడు జిమ్ ట్రైనర్ చెంచయ్య పట్టుకునేందుకు అతని సొంత ఊరు పుత్తూరు దగ్గరికి ఎస్ ఐ. నాగేంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ ముని రాజాలు.. చెంచయ్య తల్లి, కుటుంబ సభ్యులు తీసుకెళ్తుండగా.. రేణిగుంట కె.ఎల్ ఎం. హాస్పిటల్ వద్ద వారు తిరిగి వస్తున్న మహేంద్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయింది. దీంతో ఎస్ఐ నాగేంద్ర బాబు, హెడ్ కానిస్టేబుల్ మునిరాజా, నిందితుడు చెంచయ్య కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వారిని రుయా హాస్పిటల్ కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నారాయణాద్రి హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement