Friday, May 3, 2024

తగ్గేదేలే.. బాదుడే.. బాదుడు.. నేటి రేట్లు ఇవీ

దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నాన్ స్టాప్ గా పెట్రోల్, డీజిల్ ధరలు పెగుతుండగా..తాజాగా మరోసారి పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గురువారం పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 35 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజదాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.29కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.09కు చేరింది. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.112.59కు చేరుకుంది. డీజిల్ ధర లీటర్​కు రూ.105.80కి ఎగసింది. కాగా, వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పారిస్ తో కేటీఆర్ బిజీబిజీ.. తొలిరోజు నుంచే ప్రముఖులతో భేటీలు

Advertisement

తాజా వార్తలు

Advertisement