Sunday, May 5, 2024

Exclusive | వాళ్లు నోబాల్స్​ వేస్తుంటే, మేము సెంచరీలు కొడుతున్నాం.. లోక్​సభలో ప్రధాని సెటైర్లు!

అవిశ్వాస తీర్మానంపై లోక్​సభలో ఇవ్వాల (గురువారం) హాట్​ హాట్​ చర్చ జరుగుతోంది. విపక్షాలు పెట్టిన ఈ తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇస్తూ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. విపక్షాలు చర్చకు ఫీల్డింగ్ నిర్వహించాయని, అయితే బీజేపీ, ఎన్డీయే మాత్రం ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించిందన్నారు. అవిశ్వాస తీర్మానం పేరుతో ప్రతిపక్షాలు నో బాల్‌లు వేస్తూనే ఉన్నాయని, అయితే అధికార కూటమి మాత్రం సెంచరీలు కొడుతూనే ఉందని అన్నారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రతిపక్షంలో ఉన్న నా సహోద్యోగులను అడగాలనుకుంటున్నాను.. మీరు ఎందుకు సిద్ధంగా ఉండకూడదు? కొంచెం కష్టపడండి. సిద్ధం కావడానికి మీకు ఐదేళ్ల సమయం ఇచ్చాను. 2018వ సంవత్సరం (ఆ సంవత్సరం అవిశ్వాస తీర్మానం తర్వాత)లోనే చెప్పాను. మీరు కచ్చితంగా మళ్లీ అవిశ్వాసంతో రావాలని. కానీ, ఐదేళ్లలో మీరు ఏమీ చేయలేకపోయారు. మీరంతా ఏ స్థితిలో ఉన్నారో దేశం గమనిస్తోంది”అని ప్రధాని మోదీ విపక్షాలను ఎగతాలి చేసారు. దేశం ప్రతిపక్షాలను చూస్తోందని, పార్టీలు చెప్పేవన్నీ ప్రజలు వింటున్నారని, అయితే అవి ప్రజలకు నిరాశ తప్ప మరేమీ ఇవ్వలేదన్నారు.

అవిశ్వాస తీర్మానంపై ప్రధాని సమాధానం ఇచ్చిన సందర్భంగా ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాలు ఎన్‌డిఎకు అదృష్టమని, 2019లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, సంవత్సరం తర్వాత  బీజేపీ మళ్లీ భారీగా ప్రజాధరణ పొందిందన్నారు. ‘‘భారతదేశం మాపై పదే పదే విశ్వాసం ఉంచింది… 2024 ఎన్నికల్లో ఎన్‌డిఎ, బిజెపి అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధిస్తుంది. తిరిగి అధికారంలోకి వస్తుంది”అని ప్రధానమంత్రి అన్నారు.

- Advertisement -

అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన మూడు రోజుల్లో అనేక అంశాలపై చర్చలు జరిగాయని, అయితే ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందిన ఇతర రోజుల్లో ప్రతిపక్షాలు సభను నడపనివ్వలేదని ప్రధాని పేర్కొన్నారు. వారికి ప్రజల గురించి చింత లేదు, వారి ప్రధాన లక్ష్యం రాజకీయాలు. బిల్లులు గ్రామస్తులు, పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం.. భవిష్యత్తుకు సంబంధించినవి చాలా ఉన్నాయి. కానీ వారికి దీనిపై ఆసక్తి లేదు. పని చేయడానికి పార్లమెంటుకు పంపిన ప్రజల నమ్మకాన్ని వారు దెబ్బతీశారు.. అని ప్రధాని మోదీ అన్నారు. దేశం కంటే తమ పార్టీ ముఖ్యమని నిరూపించారని, వారికి పేదల ఆకలి కాదు, అధికారం కోసం ఆరాటం.. యువత భవిష్యత్తుపై ఆందోళన కాదు.. వారి భవిష్యత్తుపై ఆందోళన”ఉందని విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement