Friday, May 17, 2024

పీఎఫ్ఐ సంస్థపై కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు.. 200మంది అరెస్ట్

పీఎఫ్ఐ సంస్థపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ ఏకకాలంలో ఎనిమిది రాష్ట్రాల్లో దాడులు చేస్తోంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 మంది పీఎఫ్ఐ కార్యాకర్తలను అరెస్ట్ చేశారు. కర్ణాటకలో 60మంది, ఢిల్లీలో 30మంది, అస్సాంలో 8మందిని అరెస్ట్ చేశారు. అలాగే నలుగురు పీఎఫ్ఐ సభ్యులను థానె క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో ఇద్దరు, కళ్యాణ్ లో ఒకరు, భివాండిలో ఒకరిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement