Thursday, May 16, 2024

FLASH: ఇటుకల ట్రాక్టర్ ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

తిరుపతి జిల్లా బి.ఎన్.కండ్రిగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలైయ్యాయి వారిలో ఒకరి పరిస్థితి విషమం ఉంది. బుచ్చినాయుడు కండ్రిగ కాటూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వినుకొండ నుండి కాణిపాకం వస్తున్న భక్తులు దారి తప్పి తడ మీదుగా వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు రవి(37) మృతి చెందగా.. అబ్దుల్ ఖాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. బుచ్చినాయుడు కండ్రిగ పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement