Friday, May 3, 2024

దేశంలో ‘వైట్​ ఫంగస్​’.. మరో కొత్త వ్యాధి!

దేశంలో బ్లాక్​ ఫంగస్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. మరో కొత్త రకం వ్యాధికి సంబంధించిన వార్త కలవరపెడుతోంది. ఓవైపు దేశం కరోనాతో విలవిలలాడుతుంటే.. మరోవైపు బ్లాక్​ ఫంగస్​ ప్రజలను కలవరపెడుతోంది. దేశ నలుమూలలా బ్లాక్​ ఫంగస్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త వ్యాధి బయటపడింది. దాని పేరు ‘వైట్​ ఫంగస్​’.  బిహార్​లో 4 వైట్​ ఫంగస్​ కేసులు బయటపడ్డాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా లక్షణాలతో పట్నాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవలే నలుగురు చేరారు. వారికి పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్​గా తేలింది. దీనిపై అక్కడి వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. విస్తృతంగా పరీక్షించి.. వారికి వైట్​ ఫంగస్​ సోకిందని నిర్ధరించారు. వైట్​ ఫంగస్​ రోగుల్లో ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉంటాయి. వాటితో పాటు శరీరంలోని అనేక అవయవాలపై ఈ ఫంగస్​ ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మం, గోళ్లు, నోటి లోపలి భాగం, కిడ్నీలు, మెదడుపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్లాక్​ ఫంగస్​ కన్నా ఈ వైట్​ ఫంగస్​ ప్రమాదకరం కాదని  హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: బ్లాక్​ ఫంగస్ను ప్రమాదకర జబ్బుగా గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement