Thursday, April 25, 2024

ప్రధాని చేసిన ఒక్క వాగ్ధానం కూడా నెరవేరలేదు.. సీఎం కేసీఆర్

ప్రధాని చేసిన ఒక్క వాగ్ధానం కూడా నెరవేరలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చిందన్నారు. ఈ కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి బ్రేక్ పడుతుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కు రూ.24వేల కోట్లు ఇవ్వమంటే.. 24పైసలు కూడా ఇవ్వలేదన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వనప్పుడు ఇక ఆ సంస్థ ఎందుకని ప్రశ్నించారు. 8ఏళ్ల నీతి ఆయోగ్ సాధించింది ఏమీ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement