Friday, May 3, 2024

నిజామాబాద్ లో ఉగ్రలింకులపై NIA ప్రత్యేక నిఘా

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఉగ్రలింకులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక నిఘా పెట్టింది. ఆర్మూర్ కు చెందిన షేక్ నవీద్ వ్యవహారాలపై విచారణ వేగవంతం చేశారు. నవీద్ పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతాలు, సెల్ ఫోన్లు ఎన్ఐఏ సీజ్ చేసింది. ఆగస్ట్ 12న విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చిన డబ్బు ఎటు వెళ్లిందన్న కోణంలో విచారణ చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ పై ఎన్ఐఏ ఆరా తీస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement