Monday, May 6, 2024

ట్విట్ట‌ర్ కొత్త సీఈవోగా .. భార‌త సంత‌తికి చెందిన ప‌రాగ్ అగ‌ర్వాల్ ..

ట్విట్ట‌ర్ సీఈవో ప‌ద‌వికి రాజీనామా చేశాడు జాక్ డోర్సే..కాగా, సీఈవో పదవి నుంచి తప్పుకున్న డోర్సే 2022లో పదవీ కాలం ముగిసేంత వరకు ట్విట్టర్ బోర్డులోనే కొనసాగుతారు.దాంతో కొత్త సీఈవోగా భార‌త సంత‌తికి చెందిన ప‌రాగ్ అగ‌ర్వాల్ ని నియ‌మించారు. కాగా ప‌రాగ్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ గా ఉన్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్, స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చేశారు అగర్వాల్.. ఈ పదవిని చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.

డోర్సే మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని భావిస్తున్నట్టు ఆశిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.పరాగ్ నియామకంపై డోర్సే మాట్లాడుతూ.. పరాగ్‌ను ఏకగ్రీవంగా ఎంచుకున్నట్టు చెప్పారు. కంపెనీ అవసరాలను అతడు లోతుగా అర్థం చేసుకున్నాడని, ట్విట్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అతడు ఉన్నాడని అన్నారు. పరాగ్‌లో ఆసక్తి, హేతుబద్ధత, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయని అన్నారు. సీఈవోగా ఆయనపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement