Sunday, April 28, 2024

Exclusive | యువి రికార్డు బద్దలు.. 9 బంతుల్లో 52 రన్స్​ చేసిన​ నేపాల్​ బ్యాటర్​!

ఏసియన్​ గేమ్స్​ టీ20 క్రికెట్​లో రికార్డు బద్దలైంది. ఇప్పటిదాకా సురక్షితంగా ఉన్న స్టార్​ బ్యాటర్​ యువరాజ్​సింగ్​ రికార్డును నేపాల్​ క్రికెటర్​ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా 9 బంతుల్లో హాఫ్​ సెంచరీ చేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తాడు. యువరాజ్​ సింగ్​ రికార్డును నేపాల్​ బ్యాటర్​ దీపేంద్రసింగ్​ అధిగమించడంతో మరో రికార్డు నెలకొల్పినట్టు అయ్యింది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

టీ20 క్రికెట్​ అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా నేపాల్​ మరో కొత్త రికార్డును సృష్టించింది. మంగోలియాపై జరిగిన పోరులో నేపాల్​ నిర్ణీత 20 ఓవర్లలో 314 అత్యధిక పరుగులు చేసి కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఇందులో కుషాల్​ భుర్టెల్​ (19), ఆసిఫ్​ షేక్​ (16), రోహిత్​ పౌడెల్​ (61) చేసి అవుట్​ కాగా కుషాల్​ మల్లా 137, దీపేంద్ర సింగ్​ 52 పరుగులతో నాటౌట్​గా నిలిచారు. ఇక దీపేంద్ర సింగ్​ కేవలం 9 బంతుల్లోనే 52 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో ఎనిమిది సిక్స్​లున్నాయి.

- Advertisement -

కాగా, ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన మంగోలియా జట్టు అత్యంత భారీ టార్గెట్​ ముందు చేతులెత్తేసింది. 315 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన జట్టు 13 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 41 పరుగులు చేయగలిగింది. ఇందులో ఓపెనర్లు నరేంబతార్​ (1), తెర్బిష్​ (0) కాగా, ఒత్కోంబయార్​ (3), ఎర్డెన్​బుల్గన్​ (0), దేవాసురన్​ జంయాసురన్​ (10) పరుగులు చేశారు.. ఇక మిగతా వారంతా ఒక్క రన్​కే పెవిలియన్​ బాట పట్టారు. దీంతో మంగోలియా జట్టు దారుణంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో నేపాల్​ జట్టు 273 పరుగుల భారీ ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement