Thursday, April 25, 2024

Breaking: ముస్లింల ఆందోళ‌న‌ హింసాత్మకం.. యూపీ, బెంగాళ్‌లో టియర్​ గ్యాస్​ ప్రయోగం

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ లీడ‌ర్ల‌ను అరెస్టు చేయాల‌ని ఇవ్వాల దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ జామా మసీదు వద్ద భారీగా నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్, మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వ‌హించారు. కాగా, బెంగాల్, యూపీలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.

దీంతో పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. అనేక ప్రాంతాల్లో పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. దాడులకు దిగారు. ఈ దాడుల్లో అనేక రిక్షాలు, ఆటోలకు నిప్పు పెట్టారు. కాగా, ల‌క్నో, ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మార‌డంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ వ‌దిలి స‌ద్దుమ‌ణిగేలా చేశారు. అయినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ర‌బ్బ‌ర్ బుల్లెట్ల‌తో కాల్పులు జ‌రిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement