Wednesday, May 15, 2024

ఎంపీ న‌వ‌నీత్ రాణా దంప‌తుల -బెయిల్ ర‌ద్దు చేయాల‌ని పోలీసుల పిటిష‌న్

హ‌నుమాన్ చాలీసా వివాదంలో అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీత్ రాణా దంప‌తులపై కేసు న‌మోద‌యింది. కాగా వీరికి కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 27వ తేదీన కోర్టు విచారణ చేపట్టనున్నది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ రాణా దంపతులు ప్రకటించారు. దీంతో వీరిద్దరిని ముంబై పోలీసులు ఏప్రిల్ 23వ తేదీన అరెస్ట్ చేశారు. అనంతరం దంపతులిద్దరు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ఆ తర్వాత ముంబై కోర్టు రూ.50 వేల పూచీకత్తుతోపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. షరతులను ఉల్లంఘిస్తే.. బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. పోలీసులకు 24 గంటల ముందుగా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement