Friday, April 19, 2024

బ్రిడ్జిని పేల్చిన మావోయిస్టులు – సెల్ ఫోన్ ట‌వ‌ర్ కి నిప్పు

ఓ వంతెన‌ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘ‌ట‌న జార్ఖండ్ గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఈ మ‌ధ్య‌కాలంలో మావోయిస్టులు వ‌రుస‌గా దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. కాగా జిల్లాలోని ఒక మొబైల్ ఫోన్ టవర్‌ను పేల్చేశారు. మరో టవర్‌కు నిప్పుపెట్టి క‌ల‌క‌లం రేపారు. మావోయిస్టుల నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోలు ప్ర‌స్తుతం ‘రెసిస్టెన్స్ వీక్’ పాటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే విధ్వంసాల‌కు తెగ‌బ‌డుతున్నారు. మొదట ఖుఖ్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎయిర్‌టెల్ టవర్‌కు నిప్పుపెట్టిన మావోయిస్టులు, అనంత‌రం జైనుల యాత్రాస్థలం మధుబన్‌లోని ఐడియా టవర్‌ను పేల్చేశారని అధికారులు వివ‌రించారు. మావోయిస్టుల చ‌ర్య‌ల నేప‌థ్యంలో వారి కోసం ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement