Wednesday, May 1, 2024

పొరపాటున నోరు జారిన.. మనసులు నొప్పించినందుకు విచారిస్తున్నా : పట్నం మహేందర్ రెడ్డి

నిన్నటి సంఘటనతో ఉన్న ఆడియో క్లిప్పులతో పోలీసుల మనస్సు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతల్లో వారి కృషి అభినందనీయమన్నారు. నిన్నటి నుండి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్ లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement