Friday, May 3, 2024

Bengaluru : సూట్ కేసులో తల్లి శవం… పోలీసులకు లొంగిపోయిన కుమార్తె

ఓ కూతురు తన తల్లినే చంపి సూట్ కేసులో శవాన్ని కుక్కి.. ఆ సూట్ కేసుతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూతురు లొంగిపోయిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ కూతురు తన తల్లిన చంపి ట్రాలీ బ్యాగ్ లో కుక్కింది. అనంతరం మృతదేహంతో పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. మైకో లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. అయితే తన తల్లితో సదరు మహిళకు తరచూ గొడవ చోటు చేసుకునేది. దీంతో విసుగెత్తిన ఫిజియోథెరపిస్ట్ తన తల్లిని హతమార్చింది. అనంతరం తల్లి శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. తల్లిని హత్య చేశానని చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement