Wednesday, May 1, 2024

Boinpalli : జ‌లాశ‌యంలో దూకి.. ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య

త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లి జ‌లాశ‌యంలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చోటుచేసుకున్నది. శభాష్‌పల్లి వంతెన వద్ద మిడ్‌ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్నది. మృతుల్లో తల్లి రజిత, ఉస్మాన్ అహ్మద్ (14), అయ్యన్ (7), అశ్రజాబిన్ (5 నెలలు) ఉన్నారు.

వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంకి చెందిన రజిత కరీంనగర్ లోని సుభాష్ నగర్ కి చెందిన మహ్మద్ అలీతో 9 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగినప్పటి నుండి తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రజిత పుట్టింటి వారు వేములవాడలో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదై రెండు నెలల క్రితం కేసు కొట్టివేయబడింది. వారు ఇరువురు రాజీకి రావడంతో కేసును కొట్టివేశారు. అయితే గత మూడు రోజుల క్రితం రజిత తన పిల్లలతో పుట్టింటికి రాగా మర్నాడు తన భర్త దగ్గరికి వెళ్లాలని కుటుంబీకులు చెప్పగా.. తన పిల్లలతో జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement