Friday, May 10, 2024

Flash: నిజామాబాద్ లో విషాదం.. ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన ఓ మహిళా పిల్లలతో కలసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. నందిపేట్ మండలంలోని గుత్ప కెనాల్ లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. స్థానికంగా ఉన్నవారు తల్లిని కాపాడారు. అయితే ఇద్దరు పిల్లలు మాత్రం గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

నందిపేట్ మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన వారిలో ఆరు నెలల బాబుతోపాటు రెండు సంవత్సరాల కూతురు ఉంది. అయితే, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏంటి అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement