Friday, May 3, 2024

ఓటీటీ బిగ్ బాస్ లో మోస్ట్ ఇరిటేటింగ్ ప‌ర్స‌న్ – ఎవ‌రో తెలుసా

ఓటీటీ బిగ్ బాస్ లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవ‌రో..అలాంటి వారికి మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్లాగ్ ఇవ్వాల‌ని బిగ్ బాస్ తెలిపాడు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ అందరూ తమను ఇరిటేట్ చేసే పర్సన్స్ నేమ్ చెప్పి వారికి ఫ్లాగ్స్ ఇవ్వ‌డానికి ముందుకొచ్చారు. ఈ ప్రోమోలో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఆ ఫ్లాగ్ ను నటరాజ్ మాస్టర్ కు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలా ఆయనే మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అని ప్రూవ్ అవుతోంది. బిందుమాధవి తో పాటు ఇంకా కొంత మంది మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్లాగ్ ను నటరాజ్ మాస్టర్ కు ఇచ్చేశారు. ఇందుకు గల కారణాలను కూడా వారు వెల్లడించారు. నటరాజ్ మాస్టర్ సోది చెప్తారన్నట్లు వారు పేర్కొన్నారు. నటరాజ్ మాస్టర్ పాయింట్ లేకుండా మాట్లాడుతారని బిందు మాధవి చెప్పింది. అయితే, అషురెడ్డి మాత్రం బిందు మాధవియే మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ అని తెలిపింది. ఆమెకు ఫ్లాగ్ ఇచ్చేసింది. మిత్ర, అఖిల్, ముమైత్ ఖాన్ ఇలా కంటెస్టెంట్స్ అందరూ రీజన్స్ చెప్పి మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్లాగ్స్ ఇచ్చేశారు. ఫైనల్ గా ఎవరు మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ అనేది ఈ రోజు నైట్ 9 గంటలకు ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన తర్వాతే స్పష్టమవుతుంది. 37వ రోజు ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement