Thursday, May 2, 2024

తాటి చెట్టు ఎక్కేసి.. కల్లు చుక్క తాగేసి.. తాటి వనంలో కోతులు హంగామా

తాటి చెట్టు ఎక్కలేవు.. తాటి కల్లు లేవు అన్నట్టుంది గీత కార్మికుల పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గీత కార్మికులకు కొత్త టెన్షన్ వచ్చింది. కోతులు చెట్టు ఎక్కేసి.. కల్లు చుక్క తాగేసి…చిందులే.. చిందులు వేస్తున్నాయి. అసలే కోతి ఆపై కల్లు తాగిందనే నానుడి గుర్తుండే ఉంటుంది. అక్షరాలా అలానే  కోతులు తాటివనంలో చేరి నానా హంగామా చేశాయి. తాటిచెట్లపై కుండల్లో కల్లు తాగి నానా హాంగామా చేస్తున్నాయి. దీంతో గీత కార్మికులు తలలు పట్టుకుంటున్నారు.

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో కోతులు తాటి చెట్లు ఎక్కి కల్లు తాగుతూ, తాటి వనంలో హల్చల్ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తాటి చెట్లపై కుండల్లో కల్లు ఖాళీ.. అవుతుండడంతో గీత కార్మికులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరైనా దొంగిలిస్తున్నారా? అనే అనుమానంతో చెట్ల దగ్గరే కాపలా కాశారు. అయితే, కోతులు తాటి చెట్లేక్కి కుండలో కల్లు తాగుతుండడంతో ఒక్కసారిగా చూసి కంగుతిన్నారు. అక్కడే ఉన్న కొంత మంది కల్లు ప్రియులు సైతం ఆశ్చర్య పడుతూ ఆసక్తిగా కోతులు చేస్తున్న పనిని తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement