Friday, May 10, 2024

మోడీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. సీఎం కేసీఆర్

మోడీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జలవిహార్ లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… విపక్షాలపై మోడీ అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రసంగాలు చేయడం కాదు.. మా ప్రశ్నలకు జవాబు ఇవ్వాలన్నారు. మోడీ చెప్పిన మాటలు ఏవైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. చెప్పిన ఒక్క మాట కూడా ఆయన నెరవేర్చలేదన్నారు. ఇది నేను చెప్పడం కాదు.. దేశమంతా చెప్తోందన్నారు. మమ్మల్ని మించిన మేధావి మరొకరు లేరని మీరనుకుంటున్నారన్నారు. డీజిల్, ఎరువులు, అన్నింటి ధరలు పెంచారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement