జవహర్ నగర్ (ప్రభ న్యూస్) : మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గిరిప్రసాద్ నగర్ లో 14 ఏళ్ల మైనర్ బాలికపై ఇంటి పక్కన ఉండే రవి అనే వ్వక్తి ( 21) పలు మార్లు అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది.
కాగా, కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో ఆ మైనర్ ప్రెగ్నెన్సీ అని తేలడంతో ఆందోళనకు గురయ్యారు. దీనికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వారి కంప్లెయింట్ మేరకు జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు.