Friday, May 3, 2024

కరీంనగర్ లో కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు కరీంనగర్ లో ఘానా స్వాగతం లభించింది . 1030 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిందుకు గురువారం కరీంనగర్ సమీపంలోని తిమ్మాపూర్ వద్ద ఘన స్వాగతం పలికారు. మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, టీఆర్ఎస్ నేతలు స్వాగతాం పలికారు. అక్కడి మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా అల్గునూర్ వంతెన వద్దకు చేరుకొని భగీరథ పైలాన్ ను ఆవిష్కరించారు. రూ. 410 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించారు. అనంతరం బైపాస్ మీదుగా మార్కెఫెడ్ మైదానంకు చేరుకొని మంత్రి గంగులతో కలసి 615 కోట్ల రూపాయలతో చేపట్టే అభివుద్ది పనుల శీలా పలకలను ఆవిష్కరించారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య కరీంనగర్ కు మరిన్ని వరాలు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement