Sunday, April 28, 2024

Breaking: హైద‌రాబాద్ చేరుకున్న మాజీ సీఎం కుమార‌స్వామి, అండ్​ టీమ్​.. స్వాగ‌తించిన మంత్రి కేటీఆర్‌

రేపు హైద‌రాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కే. చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ప్ర‌త్యేక స‌మావేశం జ‌ర‌గ‌నుంది. దీనికి హాజరయ్యేందుకు క‌ర్నాట‌క మాజీ సీఎం కుమార‌స్వామితో పాటు ప‌లువురు నేత‌లు ఇవ్వాల రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. వీరిలో జేడీఎస్ మాజీ మంత్రి రేవన్న, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉన్నారు.
ఇక‌.. జేడీఎస్ ప్రతినిధి బృందానికి బేగంపేట ఎయిర్ పోర్టులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు స్వాగ‌తం ప‌లికారు. రేపు తెలంగాణ భవన్ లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ భేటీకి కుమారస్వామి బృందం కూడా హాజ‌రుకున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement