Friday, May 3, 2024

నాటి వార్త‌ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన మంత్రి ‘కేటీఆర్’

సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంత్రి కేటీఆర్. ఏ విష‌యానైనా సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంటారాయ‌న‌. కాగా కేంద్రాన్ని దారికి తెస్తాం…తెలంగాణ సాధిస్తాం అని 2001, మేలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల గురించి ‘ఈనాడు’ దిన‌ప‌త్రిక‌ మొద‌టి పేజీలో అప్ప‌ట్లో వ‌చ్చిన వార్త‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ‘తొలుత వారు ప‌ట్టించుకోరు.. ఆ త‌ర్వాత నిన్ను చూసి న‌వ్వుతారు.. అనంత‌రం నీతో గొడ‌వప‌తారు.. అయిన‌ప్ప‌టికీ తుది విజ‌యం నీదే’ అంటూ మ‌హాత్మా గాంధీ సూక్తుల‌ను కేటీఆర్ ఈ సంద‌ర్భంగా పోస్ట్ చేశారు. గాంధీ చెప్పిన‌ట్లుగానే మొద‌ట కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను చాలా మంది రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఎగ‌తాళి చేశార‌ని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఆయ‌న నాయ‌క‌త్వంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వంలో పోరాడ‌దామ‌ని ఇటీవ‌ల కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌త్య‌ర్థుల నుంచి మ‌ళ్లీ విమ‌ర్శలు వ‌స్తున్న నేప‌థ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement