Wednesday, May 1, 2024

Delhi : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మంత్రి కేటీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఢీల్లీ చేరుకున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్‌ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. అందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిర్వహణకు చేపట్టిన ఎస్సార్డీపీలో భాగంగా తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భూములు ఇవ్వాల్సిందిగా మంత్రిని కోరనున్నారు. అలాగే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భూముల విషయమై గత కొన్నేండ్లుగా కేంద్రం ఏటూ తేల్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విశయం తెలిసిందే. దీంతోపాటు.. రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు హోంశాఖ పరిధిలోని భూముల అవసరం ఉన్నది. ఇందుకు అవసరమైన సహకారంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement