Thursday, April 25, 2024

వచ్చారు.. తిన్నారు.. తాగారు.. వెళ్లారు: అమిత్ షాపై కేటీఆర్ సెటైర్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్​నడుస్తోందని ఎద్దేవా చేశారు. ‘’వచ్చాడు.. తిన్నాడు.. తాగాడు.. వెళ్లాడు..’’ అంటూ అమిత్​షాను ఉద్దేశించి సైటైర్ వేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని, ఇప్పటికీ కూడా అదే తంతు ఇంకా కొనసాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అంటే ‘బక్వాస్ జుమ్లా పార్టీ’ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా, కొంత కాలంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం – బీజేపీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న నిర్వహించిన బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో కేంద్రహోం మంత్రి అమిత్ షా పాల్గొని టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అవినీతి, అసమర్ధ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement